మరో 11 ఎమ్మెస్వో లైసెన్సుల జారీ

0
1469

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ సెప్టెంబర్ నెలలో 11 మంది ఎమ్మెస్వోలకు తాజాగా డిజిటల్ లైసెన్సులు మంజూరు చేసింది. దీంతో అక్టోబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన ఎమ్మెస్వోల సంఖ్య 1473 కు చేరింది. ఈ ఎమ్మెస్వోలు దేశమంతటా కార్యకలాపాలు నడుపుకునేందుకు అవకాశముంటుంది.

సెప్టెంబర్ 7 న సాయి కేబుల్, జయ దుర్గా డిజిటల్ నెట్ వర్క్, పి ఆర్ ఎఎ-హబ్, హర్ష కమ్యూనికేషన్స్ సంస్థలకు లైసెన్సులు మంజూరయ్యాయి. ఆ తరువాత 17 న మాగమా మీడియా సర్వీసెస్, వైజాగ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ, 22 న ఫైబర్ ఎయిర్ సర్వీసెస్ , రాఘవ్ రెడ్ టీవీ అనుమతి పొందాయి. సెప్టెంబర్ 24 న రాఘోగఢ్ డిజిటల్ కేబుల్ కు, 27 న సాయి కేబుల్ నెట్ వర్క్ కు, 28 న జననీ కేబుల్ నెట్ వర్క్ కు అనుమతి లభించింది.

సెప్టెంబర్ లో లైసెన్స్ పొందిన సంస్థలలో తెలంగాణకు చెందిన పి ఆర్ ఈ-హబ్ (మహబూబ్ నగర్ జిల్లా), ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైజాగ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ద్వారకానగర్, విశాఖపట్నం ), సాయి కేబుల్ నెట్ వర్క్ (ఆళ్ళగడ్డ, కర్నూల్ జిల్లా) ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here