త్వరలో జీ తెలుగు న్యూస్ చానల్

0
2378

ఈ ఎలక్షన్ సంవత్సరంలో జీ మీడియా కార్పొరేషన్ మూడు చానల్స్ ప్రారంభిస్తోంది. అందులో ఒకటి జీ న్యూస్ హెచ్ డి చానల్ కాగా ఒక కన్నడ న్యూస్ చానల్, ఇంకొక తెలుగు న్యూస్ చానల్ కూడా ఉన్నాయి.

గతంలో జీ 24 గంటలు పేరుతో తెలుగులో 24 గంటల న్యూస్ చానల్ నడిపిన జీ సంస్థ ఆ తరువాత కొంతకాలం లీజుకివ్వటం, ఆ తరువాత పూర్తిగా మూసి వేయటం తెలిసిందే. జీ 24 గంటలు పేరుతో ఉన్న లైసెన్సును ఇప్పుడు ఒడియా న్యూస్ చానల్ కు వాడుకుంటోంది.

జీ న్యూస్ ఈ మధ్యనే ఆకర్షణీయమైన రంగులతో సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రావటం చూశాం. ఇప్పుడు దాన్ని హెచ్ డి లో అందించాలని నిర్ణయించుకుంది. మార్కెట్ రీసెర్చ్ ఆధారంగా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈ మార్పులు చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ తెలుగులో ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా చానల్ నడుపుతుండగా జీ మీడియా కార్పొరేషన్ ఇప్పటికే తెలుగులో వార్తలతో డిజిటల్ ప్లాట్ ఫామ్ నడుపుతోంది. జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర బీజేపీ తరఫున 2014-22 మధ్య రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here