తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలకు ఫైబర్ గ్రిడ్

0
1004

ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బిబిఎన్ ఎల్ ప్రాజెక్ట్ ను వివిధ రాష్ట్రాలు వేగంగా అమలు చేసేపనిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓవర్ హెడ్ కేబుల్ వేయగా తెలంగాణలో మరింత పటిష్ఠంగా ఉండేలా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయటం, మిషన్ భగీరథలో అనుసంధానం చేయటం ద్వారా అవే పైపుల ప్రక్కనే కేబుల్ పైపులు కూడా వేసేలా చర్యలు తీసుకోవటం తెలిసిందే.
ఇలా ఉండగా, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై సమీక్షించిన కేటీఆర్ ఫైబర్ గ్రిడ్ ను మరింత విస్తరించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ తమ లక్ష్యమని పేర్కొంటూ హైదరాబాద్ పరిధిలో కూడా సర్వే చేయాలని సూచించారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అన్ని మున్సిపాలిటీలకు తీసుకెళ్లాలని అధికారులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని మరింత విస్తరించాలని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ సదుపాయాన్ని ఒక నిత్యావసరం అంశంగా పరిగణించి తెలంగాణ పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం చేరుకునే విధంగా ప్రణాళికలు ఉండాలని నిర్దేశించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయని వివరించారు.
టీ-హబ్ లో నేడు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది ఆగస్టు కల్లా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఫైబర్ అనుసంధానం జరుగుతుందని అధికారులు మంత్రికి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here