సవరించిన కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు చేయటానికి ట్రాయ్ కట్టుబడి ఉన్నట్టు తేలిపోవటంతో ఇప్పుడు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే వాళ్ళకు ఇది ఎలా నష్టం చేస్తుందో మాట్లాడుతున్నారు. లబ్ధిపొందే చందాదారుడు మాత్రమే మౌనంగా ఉన్నాడు. చందాదారులందరి తరఫునా ట్రాయ్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ పోరాటాన్ని అడ్డుకోవటానికి బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు కోర్టుల్లో చేస్తున్న ప్రయత్నం ఫలితాలకోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఇంతకీ కొత్త టారిఫ్ ఆర్డర్ చెప్పిందేంటంటే బ్రాడ్ కాస్టర్లు ఏదైనా చానల్ ను బొకేలో పెట్టాలనుకుంటే దాని గరిష్ఠ చిల్లర ధర రూ. 12 మించకూడదు. అంటే రూ.19 నుంచి రూ.12కు తగ్గించాల్సి ఉంటుంది. అదే విధంగా బొకే లోని చానల్స్ విడి ధరల్లో 33 శాతం మించి బొకేకి డిస్కౌంట్ ఇవ్వకూడదు. దీనివలన ఏదోరకంగా చానల్ అంటగట్టే విధంగా బొకేలు ఉండవు. ఇది చందాదారులకు లాభదాయకం. మరో నిర్ణయం నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద ఇచ్చే చానల్స్ సంఖ్య 100 నుంచి 200 కు పెంచటం. అదే విధంగా దూరదర్శన్ చానల్స్ ను ఈ కనీస చానల్స్ నుంచి మినహాయించి అవి కూడా ఇవ్వాలని చెప్పటం. ఒక ఇంట్లో ఒకటి కంటే