తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ మిద్దె జితేందర్ జన్మ దినం సందర్భంగా రాష్ట్ర ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు, బ్రైట్ వే ఎండీ సుభాష్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కేబుల్ ఆపరేటర్లను ఒక తాటిపైకి తెచ్చి వారి సమస్యలపరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమ అధ్యక్షుడు జితేంద్ర జన్మదిన వేడుకలు హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో సంఘం కార్యాలయంలో ఫిబ్రవరి20 (శనివారం ) మధ్యాహ్నం జరపాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రం నలుమూలలనుంచి తరలి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొందరు సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.