ఇటీవల వెల్లడైన నిరుద్యోగుల సమాచారం కలవరపెడుతోంది. అందులోనూ మీడియా అపరిశ్రమలో పరిస్థితి మరింత దయనీయంగా తయారయింది. ఐదేళ్లక్రితం, అంటే 2016 సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా మీడియా పరిశ్రమలో 10.3 లక్షలమంది పనిచేస్తున్నారు. కానీ ఆగస్టు 2021 నాటికి కేవలం 2.3 లక్షలమందే ఉన్నారు. అంటే , గడిచిన ఐదేళ్లకాలంలో 78% మంది మీడియా ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు, లేదా మానివేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ (సి ఎం ఐ ఈ) ఈ సమాచారం విడుదల చేసింది.