జిటిపిఎల్ హాత్ వే బ్రాండ్ అంబాసిడర్ గా బొమన్ ఇరానీ

0
808

కార్పొరేట్ ఎమ్మెస్వోలు తమ వ్యాపారం విస్తరించుకోవటానికి ఏ అవకాశాన్నీ వదులు కోవటం లేదు. తాజాగా జిటిపిఎల్ హాత్ వే సంస్థ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. “కనెక్షన్ దిల్ సే “ నినాదంతో ఆయనను వాడుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంస్థ నిర్ణయించుకుంది. ఇప్పుడున్న చందాదారులను నిలబెట్టుకోవటం, కొత్తవారిని ఆకర్షించటం తమ ధ్యేయమని సంస్థ చెప్పుకుంటోంది. ఈ ప్రచారం కోసం పేరుమోసిన సంగీత దర్శకుల ద్వయం సచిన్-జిగర్ తో ఒక థీమ్ సాంగ్ కూడా తయారు చేయించుకుంటోంది.
వైవిధ్యభరితమైన నటునిగా పేరున్న బొమన్ ఇరానీ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవటం పట్ల జిటిపిఎల్ హాత్ వే మేనేజింగ్ డైరెక్టర్ అనిరుధ్ సిన్హ్ జడేజా సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటునిగా, నాటకరంగ నటునిగా, వాయిస్ ఆర్టిస్ట్ గా ఆయనకున్న పేరుప్రఖ్యాతులు ఉపయోగపడతాయని భావిస్తున్నామన్నారు. ముందుగా ఒక టీవీ వాణిజ్యప్రకటన చేసి ఆ తరువాత పత్రికల్లో, రేడియోలో కూడా ప్రకటనలు ఇస్తామన్నారు. 90 లనుంచి కేబుల్ చందాదారుగా, పదేళ్ళుగా బ్రాడ్ బాండ్ వినియోగదారుగా ఉన్న తాను ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం ఆనందంగా ఉందని బొమన్ ఇరానీ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here