ఉదయగిరి కేబుల్ నెట్ వర్క్ మీద పైరసీ కేసు

0
687

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో స్థానిక కేబుల్ నెట్ వర్క్ “ సీసీఎన్ కేబుల్ నెట్ వర్క్ టక్ జగదీష్ అనే చిత్రాన్ని పైరసీ చేసి ప్రసారం చేసిన అభియోగం మీద ఉదయగిరిపోలీసులు కేసు నమోదు చేశారు. నానీ నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకపోగా కేవలం ఓటీటీ వేదికమీదనే అందుబాటులోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 10 న విడుదల కాగా మరుసటి రోజే (11 న) దీని పైరేటెడ్ వెర్షన్ ను ఉదయగిరి లోని సీసీఎన్ కేబుల్ నెట్ వర్క్ తన ప్రేక్షకుల కోసం ప్రసారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. పైరసీ నిరోధక చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నా రు.
వెంటనే స్పందించిన ఉదయగిరి పోలీసులు ఆ నెట్ వర్క్ కార్యాలయం మీద దాడిచేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 62/2021 నెంబరుతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here