స్టార్ చానల్స్ ఇవ్వాలని ఎమ్మెస్వోకు టీడీశాట్ ఆదేశం

0
496

స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే చానల్స్ మొత్తం ఆపేసిన ఎమ్మెస్వో మీద టీడీశాట్ లో పిటిషన్ వేస్తే, ఆ చానల్స్ వెంటనే పునరుద్ధరించాలని టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అప్పెలేట్ ట్రైబ్యునల్ (టీడీశాట్) ఆదేశించింది. కేరళలో పెద్ద ఎమ్మెస్వోలలో ఒకటైన కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ ( కేసీసీఎల్) స్టార్ గ్రూప్ చానల్స్ అన్నిటినీ అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో స్టార్ యాజమాన్యం టీడీశాట్ కు ఫిర్యాదు చేసింది. తమకు గాని, చందాదారులకు గాని ఎలాంటి ముందస్తు సమాచారమూ లేకుండా చానల్స్ పంపిణీని నిలిపి వేసినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో అలా నిలిపివేసిన చానల్స్ ను 24 గంటలలోగా పునరుద్ధరించాలని టీడీశాట్ ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు మళ్ళీ విచారణ చేపట్టే వరకు అమలులో ఉంటాయని కూడా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మే 12 వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here