12నుంచి జీ తెలుగులో రాత్రి 7.30కి నాగభైరవి

0
571

జీ తెలుగు చానల్ ఈ నెల 12 నుంచి సరికొత్త సీరియల్ నాగభైరవి ప్రసారం చేయాలని నిర్ణయించింది. రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రతివారం సోమవారం నుంచి శనివారం దాకా చూడవచ్చు. జీ తెలుగు తోబాటు జీ తెలుగు హెచ్ డి చానల్ లో కూడా ఈ సీరియల్ అందుబాటులోకి వస్తుంది.

నాగవరం, హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ కథ నాగార్జున ( పవన్ సాయి), భైరవి ( యాష్మీ గౌడ) చుట్టూ అల్లుకుంటుంది.  పూర్వీకుల నుంచి వచ్చిన నాగసంపదను వెలికితీసే బాధ్యత భైరవి మీద ఉంటుంది. శివుడు ఆమెను ఆశీర్వదిస్తాడు. అయితే, భైరవి పెనుప్రమాదంలో చిక్కుకున్నప్పుడు నాగార్జుమ ఆమెను రక్షిస్తాడు. ఆ తరువాత ఇద్దరూ కలసి నాగసంపద దక్కించుకోవటానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో తెరమీద చూడాలి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ కార్యక్రమంలో బ్రాండ్ అంబాసడర్ గా ఇప్పటికే ప్రోమోలలో కనిపిస్తుండగా ఆమె పాత్ర గురించి ముమ్దు ముందు తెలిసే అవకాశముంది.

నటునిగా అందరికీ తెలిసిన పవన్ సాయి ఈ చిత్రంలో ప్రధానపాత్రలో నటించటంతోబాటు ఈ సీరియల్ తో  నిర్మాత రూపంలో కొత్త అవతారమెత్తటం మరో ప్రత్యేకత. “ నేను, కల్కి ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఈ అవకాశం ఇప్పుడిలా నాగభైరవి రూపంలో అందివచ్చింది. జీ తెలుగు చానల్ కు, జీ తెలుగు క్లస్టర్ హెడ్  అనూరాధ గూడూర్ కు, ప్రోగ్రామింగ్ హెడ్ జయంత్ కు ధన్యావాదాలు” అంటున్నారు పవన్ సాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here