నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళాంల గ్రామానికి చెందిన ముంత సత్తయ్య ఈ నెల 2 న అనారోగ్యం తో మృతి చెందారు. ఆయన కుటుంబాన్నీ కేబుల్ ఆపరేటర్ ల సంఘం తరఫున మంగళవారం పరామర్శించి. కుటుంబ సభ్యులకు సంఘం తరఫున 60,500/-ఆర్ధిక సాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కేబుల్ ఆపరేటర్ ల సంఘము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బడుగుల ఉపేందర్ యాదవ్, ఎంఎస్ఓ వాసా విద్యా సాగర్, జిల్లా నాయకులు గూడూరు అంజిరెడ్డి, మండల అధ్యక్షులు బైరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీహరి, పాటి వెంకటరెడ్డి, దుబ్బ కృష్ణ, దుబ్బాక శ్రీధర్, శ్రీను, సత్యనారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.