ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వోల సమాఖ్య కొత్త కార్యవర్గాన్ని సంస్థ అధ్యక్షుడు కె. సూర్యనారాయణరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. జనవరి 31న ఈ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. సంస్థ గౌరవ సలహాదారులుగా పి, ఆర్. శ్రీనివాస రాజు (బిసిఎన్ డిజిటల్, భీమవరం), ఎస్ సుబ్బారావు (ఎసిటి డిజిటల్, నెల్లూరు) వ్యవహరిస్తారని, పి. సాయిబాబు ( సిటీ డిజిటల్, విజయవాడ) గౌరవాధ్యక్షులుగా ఎన్నికయ్యారని ఆ ప్రకటన పేర్కొంది.
కార్యదర్శిగా సిహెచ్ చంద్రశేఖర్ ( విన్ శాట్ డిజిటల్, విశాఖపట్నం), ఉపాధ్యక్షులుగా సిహెచ్ కన్నబాబు ( టిసిఎన్ డిజిటల్, తణుకు), సంయుక్త కార్యదర్శులుగా ఎస్ కె మహేశ్ ( డివిఆర్ సిటి డిజిటల్, కర్నూల్), ఎం గోవర్ధన్ రెడ్ది ( రెడ్ది కేబుల్ కమ్యూనికేషన్స్, చిలమత్తూరు, అనంతపురం జిల్లా), కార్యనిర్వాహక కార్యదర్శులుగా జి ఎస్ ఎన్ రెడ్డి (బి ఎల్ సి నెట్ వర్క్, పీలేరు, చిత్తూరు జిల్లా), ఎన్ వి వి ఎస్ ఎస్ రెడ్డయ్య( కొత్తపేట కేబుల్ నెట్ వర్క్, కొత్త పేట, తూర్పు గోదావరి జిల్లా), కోశాధికారిగా ఎం మురళీమోహన్ రాజు ( శివాబీ డిజిటల్, గూడూరు, నెల్లురు జిల్లా) ఎన్నికయ్యారు.
సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ నుంచి డిజిటల్ లైసెన్స్ పొందిన అంధ్రప్రదేశ్ లోని ఎమ్మెస్వోలందరూ కమిటీ సభ్యులుగా ఉంటారని కూడా ఆ ప్రకటన పేర్కొంది. ఈ సంస్థ కార్యాలయం విజయవాడ అరండల్ పేట లోని కూర్మయ్య వీధిలో ఉంది.