హైదరాబాద్ హైటెక్స్ లో 27నుంచి 3 రోజుల కేబుల్ ఎగ్జిబిషన్

0
1118

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేబుల్ టీవీ ఎగ్జిబిషన్ కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2021 కరోనా సంక్షోభ సమయంలో కొద్దిపాటి విరామం తీసుకున్న తరువాత ఈ నెలలో మళ్ళీ జరగబోతోంది. సి ఎన్ సి గ్రూప్ ఆధ్వర్యంలో వరుసగా 9 వ సారి జరుగుతున్న ఈ ప్రదర్శనకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈ సారి కూడా వేదిక కాబోతున్నది. ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు ప్రదర్శన సాగుతుంది. నిజానికి నీరుడే 9 వ ప్రదర్శనకు బెంగళూరు వేదికగా నిర్ణయించి అన్నీ ఏర్పాట్లూ పూర్తి చేసినప్పటికీ కరోనా ఆంక్షల కారణంగా ఆఖరి నిమిషంలో రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఇంతకుముందు నిర్వహించిన ప్రతిసారీ పెద్ద ఎత్తున స్పందన లభించింది. అనేక టెక్నాలజీ సంస్థలు దేశవిదేశాలనుంచి వచ్చి పాల్గొనటం విశేషం. వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రసామగ్రిని, సాఫ్ట్ వేర్ ను ప్రదర్శించుకోవటానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకున్నారు. కోవిడ సంక్షోభం కారణంగా అమ్మకాలు మందగించటం వలన అనేక కంపెనీలు ఈ అవకాశాన్ని వాడుకొని కొనుగోలుదారులకు దగ్గర కావాలని భావిస్తూ ఉన్నాయి. అదే సమయంలో కేబుల్ పరిశ్రమ కూడా ఈ రెండేళ్ళలో సాంకేతికంగా వచ్చిన మార్పులను తెలుసుకోవటానికి, కొత్త టెక్నాలజీని, పరికరాలను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతోంది.
ఇటీవలి కాలంలో ఒకటీ ఆరా వర్చువల్ ఎగ్జిబిషన్ లు జరిగినా, స్వయంగా చూసి, అనుభూతి చెంది, ప్రాంతీయ భాషలో సమాచారం తెలుసుకొని అర్థం చేసుకోవటానికి, కొనుక్కోవసటానికి ఈ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుందని కేబుల్ పరిశ్రమ భావిస్తోంది.
ఇంతకుముందు జరిగిన ప్రదర్శనలలో దాదాపు 175 కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి కోవిడ సంక్షోభం దృష్ట్యా కనీసం 100 మండికిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారని భావిస్తున్నారు. వీరిలో తయారీదారులు, పంపిణీదారులు, చిల్లర వ్యాపారులు, ప్లే ఔట్ సాఫ్ట్ వేర్ తయారీదారులు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, మిడిల్ వేర్, ఇ పి జి, కాశ్, ఎస్ ఎం ఎస్, కేబుల్ బిల్లింగ్ మెషీన్, స్ప్లై సింగ్ మెషీన్స్, ఫైబర్, కొయాక్సియల్, డిజిటల్ హెడ్ ఎండ్స్ , ఐపీటీవీ, హిట్స్, టెలికాం కంపెనీలు. ఐఓటీ. ఐసిటి తదితర అనేక సంస్థలు పాల్గొంటాయి.
గతంలో ఈ ఎగ్జిబిషన్ జరిగిన ప్రతిసారీ సగటున 15 వేల మందికి పైగా సందర్శకులు హాజరైన చరిత్ర ఉంది. సందర్శకులలో ప్రధానంగా కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, హిట్స్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో బాటు ఈ రంగం పట్ల ఆసకి ఉన్నవారంతా ఉంటారు. ప్రధానంగా రెండు తెలుగురాష్ట్రాల ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్లతోబాటు అనేక ఇతర రాష్ట్రాలవారు సైతం హాజరవుతారు.
ఈ 9 వ కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2021 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) మీద కూడా దృష్టి సారిస్తుంది. అదే సమయంలో ఎగ్జిబిషన్ ఆవరణలోనే సెమినార్లు కూడా నిర్వహిస్తారు. పరిశ్రమలోనూ, టెక్నాలజీ పరంగానూ వస్తున్న మార్పులను చర్చించే లక్ష్యంతో ఈ సెమినార్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమలో ధోరణులు, పరిశ్రమ భవిష్యత్తు, ప్రభుత్వ విధానాల మీద అవగాహన, కొత్త టారిఫ్ ఆర్డర్ ( ఏన్టీవో 2.0), నైపుణ్య శిక్షణ లాంటి అంశాలమీద సెమినార్ లో చర్చిస్తారు.
9 వ విడత ఈ కేబుల్ ఎక్స్ పో నిర్వహిస్తున్న సి ఎన్ సి గ్రూప్ అధిపతి శ్రీ రాము మాట్లాడుతూ, కరోనా సంక్షోభం కారణంగా నిరుడు బెంగళూరులో తలపెట్టిన ఎక్స్ పో ఆఖరినిమిషంలో రద్దు చేసుకోవాల్సి వచ్చిందని, ఈ సారి పరిశ్రమ నుంచి అనూహ్య స్పందన ఉండటంతో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “ అన్నీ రకాల జాగ్రత్తలూ తీసుకుంటూ, కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ అన్నీ ఏర్పాట్లూ జరుగుతున్నాయి. స్టాల్స్ కేటాయింపుకు స్పందన బాగా ఉంది. పాల్గొనేవారిలో ఉత్సాహం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.” అన్నారు.
ఈ ఎక్స్ పో బ్రోషర్ ను తెలంగాణ రాష్ట్ర మద్యనియంత్రణ, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం, సంస్కృతి, పురావస్తు శాఖలమంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 27 న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రదర్శనను కూడా మంత్రి శ్రీనివాస గౌడ్ ప్రారంభిస్తారు. స్టాల్ బుకింగ్ కోసం, సందర్శకుల రిజిస్ట్రేషన్ తదితర వివరాలకోసం సి ఎన్ సి గ్రూప్ వెబ్ సైట్ http://www.cablenetexpovision.com చూడవచ్చు.

గడిచిన రెండేళ్లలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానపు మార్పులు పరిశ్రమకు తెలియాల్సి ఉన్నందున ఈ ప్రదర్శనకు ప్రాధాన్యం వచ్చింది. మౌలిక వసతులను ఎప్పటికప్పుడు అధునాతనం చేసుకుంటున్న కేబుల్ పరిశ్రమ ఇప్పుడు చాలా కీలకదశలో ఉంది. అందుకే బ్రాడ్ బాండ్ అవకాశాలను కూడా వాడుకుంటూ ఎదగటానికి కృషి చేస్తోంది. ఒకవైపు రెండో టారిఫ్ ఆర్డర్ (ఏన్టీవో 2.0) అమలుకు సమాయత్తం అవుతుండగా కొత్త వాతావరణంలో ఏ ఆర్ పి యు (యూనిట్ కు సగటు ఆదాయం) పెంచుకోవటం మీద, డీటీహెచ్ నుంచి పోటీ తట్టుకొని నిలబడటం మీద తర్జనభర్జనలు సాగుతున్నాయి. పరిశ్రమలోని వారు తమ అభిప్రాయాలు పంచుకోవటానికి, భవిష్యత్తును నిర్దేశించుకోవటానికి కూడా ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రదర్శనకు ప్రాధాన్యం పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here