యాదాద్రి జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ సమావేశం జిల్లా అధ్యక్షులు బుగ్గ కొమురయ్య గారి అధ్యక్షతన ఈరోజు బోనగిరిలోని జగదేవ్పూర్ చౌరస్తానందుగల హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లాలోని అందరు ఆపరేటర్లు పాల్గొని వారి వారి సమస్యలను జిల్లా కమిటీ కి తెలపడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుగ్గ కొమురయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో NTO 2 అమలు గురించి మరియు ఇంటర్నెట్ అవశ్యకత గురించి డిస్ట్రిబ్యూటర్ల వలన ఆపరేటర్లకు కలిగే ఇబ్బందులను తదితర అంశములను గురించి ఆపరేటర్లకు వివరించడం జరిగింది ఇట్టి సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కార్యదర్శి రచ్చ వెంకటేష్ గారు నాకోటి నర్సింగ్ శ్యామ్ సలీం కాసుల శ్రీధర్ సుధాకర్ మెగా రెడ్డి ఎల్లారెడ్డి సలీం నరసింహారెడ్డి నర్సింలు అరవింద్ కనకయ్య అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది