కేబుల్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ స్తంభం విరిగిపడి కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు నెల్లూరు రూరల్కు చెందిన ఫైరోజు (32) సర్వేపల్లి లో కేబుల్ కేబుల్ ఆపరేటర్ గా పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం సర్వేపల్లి లోని రజక వీధిలో కేబుల్కు మరమ్మతులు చేసేందుకు విద్యుత్ స్తంభానికి నిచ్చెన వేశాడు. అయితే విద్యుత్ స్తంభం ఇటీవల కురిసిన వర్షాలకు కింద పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని గమనించలేదు. నిచ్చెన మీద విద్యుత్ స్తంభం ఎక్కి మరమత్తులు చేస్తుండగా విద్యుత్ స్తంభం ఒక్కసారిగా నేలకొరిగింది.
ఈ క్రమంలో విద్యుత్ స్తంభంకింద పై రోజ్ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.