ఐపీఎల్ 2023-27 మీడియా హక్కుల టెండర్ 25న విడుదల

0
537

2023-27 ఐదేళ్లకాలానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల టెండర్ షెడ్యూల్ ను బీసీసీఐ అక్టోబర్ 25 న విడుదల చేయబోతోంది. మంగళవారం నాటి బోర్డు సమావేశం ఈ నిర్ణయంతీసుకుంది. మొదటిసారిగా ఐపీఎల్ 2021 ఆఖరి రెండు లీగ్ మాచ్ లూ ఏకకాలంలో ఆడాలని నిర్ణయించటం విశేషం.

ఇప్పుడు నడుస్తున్న సీజన్ లో లీగ్ దశ చివరి రోజైన అక్టోబర్ 8 న ఒక మాచ్ మధ్యాహ్నం, మరో మాచ్ సాయంత్రం కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్, ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కాపిటల్స్ మధ్య ఏక కాలంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 నుంచి నిర్వహిస్తారు.

ఇంతకుముంది 2019-23 సంవత్సరాలకు గాను స్టార్ నెట్ వర్క్ కు టీవీ, డిజిటల్ తో కూడిన మీడియా హక్కులను 255 కోట్ల డాలర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం సోనీ, జియో, అమెజాన్ మీడియా హక్కుల కోసం గట్టిగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here