బతుకమ్మ టీవీ” నిర్వాహకురాలు కల్పనకు బ్రైట్ వే నివాళి

0
1376

స్మార్ట్ వే ఆధిపతి కొల్లా కిశోర్ సోదరి, బతుకమ్మ చానల్ నిర్వాహకురాలు కల్పన (40) కరోనా మహమ్మారికి బలయ్యారు. ఐదు రోజులక్రితం కరోనా పాజిటివ్ నిర్థారణ కావటంతో ఆమె ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స కొనసాగించారు. కానీ, నిన్న ఆక్సిజెన్ స్థాయి పడిపోవటంతో రామంతాపూర్ లోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో అందించిన చికిత్స ఫలించకపోవటంతో ఈరోజు సాయంత్రం ఆమె కన్నుమూశారు.
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి కేంద్రంగా ఆమె గడిచిన గత 8 సంవత్సరాలుగా “బతుకమ్మ” కేబుల్ టీవి ప్రసారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ చానల్ స్మార్ట్ వే లో ప్రసారం కావటం ప్రేక్షకులకు తెలుసు. ఆమె ఆకస్మిక మృతిపట్ల బ్రైట్ వే అధినేత, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తనకు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెస్వోల కార్యకలాపాలలో చేదోడు వాదోడుగా ఉండే కొల్లా కిశోర్ ఈ విధంగా అకస్మాత్త్తుగా తన సోదరిని కోల్పోవటం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ కిశోర్ కు సానుభూతి తెలియజేశారు.
ఇలా ఒక మహిళా జర్నలిస్టును కోల్పోవటం ఎంతో బాధకరమంటూ టియుడబ్ల్యుజె సంతాపం తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here