నీహారిక పెళ్ళి ఏర్పాట్లతో జీ తెలుగులో 23న బాపూ బొమ్మకు పెళ్ళంట.

0
548

జీ తెలుగులో వినాయక చవితి వేడుకలలో భాగంగా ఈ నెల 23న బాపు బొమ్మకు పెళ్ళంట పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కాబోతోంది. మెగా కుటుంబ సభ్యురాలు నీహారిక కొణిదెల ఒక ప్రత్యేక అతిథిగా పాల్గొనటం ఒక ప్రత్యేకత. అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ పెళ్ళి ప్రారంభానికి ముందే కాబోయే పెళ్ళికూతురు విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకోవటం ఉంటుంది.
ఇది ఈవెంట్ కాదు. ఒక అందమైన అనుభూతి అనే పేరుతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని జీ తెలుగు, జీ హెచ్ డి చానల్స్ లో ఈ నెల 23 సాయంత్రం 5 గంటలకు ప్రసారం చేస్తాయి.
నీహారిక కొత్త జీవితంలో అడుగుపెడుతుండగా జీ తెలుగు అభిమాన నటీనటులు నిర్వహించే గణేశ్ పూజలో ఆమె పాల్గొంటారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు, గల్లీ బాయ్స్ జట్టు, రవి, భాను, విష్ణు ప్రియ, చంద్ర, సత్య, అనసూయ, వేణు, ధన్ రాజ్, బాబా భాస్కర్, జానీ మాస్టర్ తదితరులు కూడా పాల్గొంటారు.
ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా ఉండే ఈ కార్యక్రమంలో నీహారిక, అనసూయ, భాను, విష్ణు, రవి తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. గల్లీ బాయ్స్, చంద్ర జట్ల మధ్య సంభాషణలు, తండ్రీకూతుళ్ళు నాగబాబు-నీహారిక మధ్య సాగే ఆహ్లాదకరమైన ఘట్టం, అకస్మాత్తుగా ప్రవేశించే నీహారిక మిత్రురాళ్ళు ఇందులో ప్రత్యేకతలుగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here